కొత్తగా మీసాలు మెలేస్తే.. ఉన్నవి కాస్త ఊడుతాయ్: కొండా సురేఖ

బుధవారం, 4 జులై 2018 (11:55 IST)
తన నియోజకవర్గంలో కొంతమంది మీసాలు మెలేస్తున్నారని.. కొత్తగా మీసాలు మెలేస్తే ఉన్నవి కాస్త ఊడుతాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రత్యర్థులను సూటిగా హెచ్చరించారు. నాయకత్వ లక్షణాలనేవి పుట్టుకతో రావాలని, ఈ విషయంలో కొండా మురళి ఒరిజినల్‌ బ్రిడ్‌ అని తేల్చేశారు. హైబ్రిడ్‌ మనుషుల మాదిరిగా వచ్చిరాని వేషాలు వేస్తే సహించేదిలేదని వార్నింగ్ ఇచ్చారు. 
 
వరంగల్‌ ఎల్‌బీనగర్‌లోని అబ్నూస్‌ ఫంక్షన్‌ప్యాలెస్‌లో పాల్గొన్న సందర్భంగా కొండాసురేఖ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా తమకు ఇలాగే అందించాలని కోరారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మాట్లాడుతూ.. రంజాన్‌ పండుగ తరువాత ఈద్‌ మిలాప్‌ నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. 
 
వివిధ మతాల సమూహంగా ఈ వేడుక నిర్వహించుకోవడం అభినందనీయమని, ప్రతీ ఒక్కరు కులమతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలని  మురళీధర రావు సూచించారు. తమ నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు