తెలంగాణ రాష్ట్రంలో వున్న విద్యుత్, రైతుల సమస్యల మీద చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా వుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర దుస్థితికి కాంగ్రెస్, టీడీపీల పాలనే కారణమని విమర్శించారు. ఈ అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ఆయన తెలిపారు.