ప్రేమించి మోసం చేశాడనీ.. ప్రియుడిపై యాసిడ్‌తో దాడి...

శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (12:51 IST)
ఇటీవలి కాలంలో ప్రేమించి మోసం చేసే ఘటనలు ఎక్కుగవా జరుగుతున్నాయి. దీంతో ప్రియురాళ్లు లేదా ప్రియులు ఆ మోసాన్ని జీర్ణించుకోలేక క్షణికావేశంలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి తనను ప్రేమించి మోసం చేసిన ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల మండలం, కొట్టాలలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొట్టాల గ్రామానికి చెందిన ఓ యువతీ యువకులు ప్రేమలోపడ్డారు. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ, ఇంతలో ఏమైందో ఏమోగానీ.. ప్రియుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. మోసం చేసిన నాగేంద్ర ముఖంపై యాసిడ్‌తో దాడి చేసింది. 
 
నాగేంద్రపై ఆ యువతి యాసిడ్ దాడి చేయడం ఇది రెండోసారి. వారం రోజుల క్రితం కూడా యువకుడిపై ఆమె యాసిడ్ పోయగా, అతడి చేయి కాలింది. ఆ గాయానికి నాగేంద్ర చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన నుంచి తన మాజీ ప్రియుడు తేరుకోకముందే ఆమె మరోసారి యాసిడ్‌ దాడి చేసి కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు