పాము కాటుకు ప్రాణాలు కోల్పోయిన అంబులెన్స్ డ్రైవర్

గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:52 IST)
కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. పాము కాటుకు ఓ అంబులెన్స్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఇది జిల్లాలోని అవుకు గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన శ్రీకాంత్(28) అనే వ్యక్తి 108 అంబులెన్స్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలో భాగంగా కర్నూలు నుంచి తిరిగి వస్తుండగా నన్నూరు(తాండ్రపాడు) వద్ద అంబులెన్స్ అపి కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లాడు. 
 
అయితే, అక్కడవున్న విషపు పాము ఒకటి అతని కాలిపై కాటేసింది. దీంతో శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంతో మంది ప్రాణాలు రక్షించిన శ్రీకాంత్.. ఇలా పాము కాటుకు మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు