కట్టుకున్న భర్త నచ్చకపోవడంతో ప్రియుడితో పారిపోయి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది ఓ ప్రియురాలు. తిరుపతిలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వరంగల్కు చెందిన రంజిత్ కుమార్, వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన మౌనికలు గత నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే మౌనికకు అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని ఇచ్చి బలవంతంగా వివాహం చేశారు తల్లిదండ్రులు.
తిరుపతిలోని ఒక ప్రైవేటు హోటల్లో గది అద్దెకు తీసుకున్న ప్రేమికుల జంట తమను విడదీస్తారేమోనన్న భయంతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించారు. బంధువులకు సమాచారాన్ని అందించారు పోలీసులు.