నా ఓటమికి మలేరియా కూడా ఓ కారణం... శిల్పా మోహన్ రెడ్డి

సోమవారం, 28 ఆగస్టు 2017 (12:09 IST)
భారీ ఆశలు పెట్టుకుని నంద్యాల ఉపఎన్నికల బరిలో నిలబడి... ఈ ఫలితం వచ్చే 2019 ఎన్నికలకు రిఫరెండం అంటూ చెప్పుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి 11వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి శిల్పాపై 20 వేల పైచిలుకు మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.
 
ఈ నేపధ్యంలో శిల్పా మోహన్ రెడ్డిని విలేకరులు చుట్టుముట్టి ప్రశ్నలు సంధించారు. మీ ఓటమికి కారణాలు ఏమిటని అడిగినప్పుడు... తెదేపా విపరీతంగా డబ్బులు పంచిందనీ, ఓటుకు 2 వేల నుంచి 5 వేల వరకూ పంచారు. అంతేకాదు... దేవాలయాలు, మసీదులు, స్మశానాలకు డబ్బు మంజూరు చేశారు. విపరీతంగా ధన ప్రవాహం జరిగింది. 
 
ఇంకా నేను మలేరియా బారిన పడి 20 రోజుల పాటు బయటకు రాలేకపోయాను. ఇది కూడా నా ఓటమికి ఓ కారణం. అంతేకాదు... భూమా నాగిరెడ్డిపై వున్న సానుభూతి కూడా పనిచేసింది. ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విమర్శించినదేమీ ఇక్కడ పనిచేయలేదు" అని చెప్పుకొచ్చారు శిల్పా మోహన్ రెడ్డి.

వెబ్దునియా పై చదవండి