కాగా, గుంటూరు జిల్లాలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాలతో పాటు, కొన్ని ఇతర ప్రాంతాలు కూడా ప్రమాదకర భూకంపాల జోన్లలో ఉన్నాయని భూగర్భ శాస్త్ర నిపుణులు ఇంతకుముందే చెప్పారు. ఆంధ్రా రాజధాని ప్రాంతం కూడా ఇదే జోన్లో ఉన్నట్టు వారు వివరించారు. ఈ విషయాన్ని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా తెలిపినట్టు సమాచారం.