అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచుతామని, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని, తమ సమస్యల పరిష్కారానికి నిరసనలు తెలుపుతున్న అంగన్ వాడీలపై పోలీసులతు దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
ఇదేనా మహిళల రక్షణ? అంటూ రోజా ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల సమయంలో 27 మంది, నాగార్జున వర్శిటీలో రుషితేశ్వరి మరణానికి కారకులైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోని బాబు విలాసాల కోసం టర్కీ పర్యటనకు వెళ్లారని నిప్పులు చెరిగారు.