మెగా బ్రదర్స్ తల్లి అంజనాదేవి మంగళవారం అస్వస్థతకు లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నుంచి అర్థాంతరంగా నిష్క్రమించి, హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.
ఈ సమావేశం జరుగుతుండగా హైదరాబాద్లో ఉంటున్న ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్టు సమాచారం అందింది. దీంతో వెంటనే ఆయన ముఖ్యమంత్రికి ఈ విషయం తెలిపి, పరిస్థితిని వివరించారు. ఆ తర్వాత ఆయన అనుమతి తీసుకుని కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా నిష్క్రమించారు. సచివాలయం నుంచే ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లారు. పవన్ వెళ్ళిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశాన్ని యధావిధిగా కొనసాగించారు.