కారంచేడులో మూవీ మొఘల్ విగ్రహం.. హైదరాబాద్... వైజాగ్‌లోను..!

శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (11:19 IST)
సినీ పరిశ్రమకు ఎనలేని సేవలందించిన మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు విగ్రహాన్ని కారంచేడులో ప్రతిష్టించనున్నారు. ఇటీవల అనారోగ్య కారణంగా సినీ నిర్మా రామానాయుడు మరణించారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. రామానాయుడు పుట్టిన గ్రామం అయినటువంటి కారంచేడులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని అనుకుంటున్నారు.
 
ఇదేవిధంగా రామానాయుడు స్టూడియోలోను, మరొకటి  హైదరాబాద్ నగరంలోను, ఇంకొకటి వైజాగ్‌లోను ప్రతిష్టించాలని అనుకుంటున్నారు. ఇందుకుగాను ప్రభుత్వ అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అనుమతి అందిన వెంటనే కారంచేడులో ఒకటి, హైదరాబాద్‌లో రెండు వైజాగ్‌లో ఒకటి రామానాయుడు విగ్రహాలను ప్రతిష్టించనున్నట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి