వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.. ముద్రగడ ఆవేదన

సెల్వి

శనివారం, 27 ఏప్రియల్ 2024 (11:05 IST)
కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి రాజకీయాల్లోకి రావడానికి ఉద్దేశ్యమేమిటని ముద్రగడ ఇటీవల ఒక ప్రకటనలో ప్రశ్నించారు. 
 
కాపు ఉద్యమ సమయంలో కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారని, ఉద్యమాన్ని అణిచివేసారని ఆరోపిస్తూ 14 రోజుల పాటు నిర్భందంలో ఉంచి భార్య, కోడలు, పిల్లలతో సహా కుటుంబాన్ని అవమానించారని విమర్శించారు. స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వలేదు. వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.
 
ఉండిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కాపు సామాజికవర్గ సభ్యుల సమావేశంలో ముద్రగడ తన ఆవేదనను వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని వేధిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా ప్రశ్నించకపోవడాన్ని ఆయన ఖండించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు