నాంపల్లి బస్టాప్ వద్ద ఘోర ప్రమాదం: నలుగురు మృతి!

మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (12:23 IST)
నాంపల్లిలోని హజ్ హౌస్ ఎదురుగా వున్న బస్టాప్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. బస్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల మీద హై టెన్షన్ కరెంట్ తీగలు పడటంతో ఆ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
చనిపోయినవారు మధ్యప్రదేశ్‌లోని జిమ్మీ సర్కస్‌కి చెందిన సుశీల్ యాదవ్, కౌసర్, రాబిన్, రమీకాంత్‌గా గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి