అల్లుడుతో అక్రమ సంబంధం.. కుమార్తె - మరో వ్యక్తితో కలిసి భర్తను ...

గురువారం, 20 ఆగస్టు 2020 (15:29 IST)
సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా, వావివరుసలు మరిచిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. చివరకు ఈ సంబంధాలే ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా అల్లుడుతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ అత్త... కట్టుకున్న భర్తను కడతేర్చింది. ఇందులో కుమార్తె, అల్లుడుతో పాటు.. మరోవ్యక్తి కూడా తనవంతు సహకారం అందించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవనగర్‌కు చెందిన గోగుల నాగశేషు(38) ఈనెల 13న హత్యకు గురయ్యాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. 
 
మద్యానికి బానిసైన నాగశేషు... కొంతకాలంగా భార్య శ్రీదేవిని హింసిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే శ్రీదేవికి అల్లుడు (కుమార్తె భర్త)తో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో ప్రతి రోజూ వేధిస్తున్న భర్తను హతమార్చాలని భార్య ప్లాన్ వేసింది. ఈ విషయాన్ని అల్లుడు మీరావలి, కుమార్తె లక్ష్మికి చెప్పగా, వారు కూడా సమ్మతించారు. వీరితోపాటు తమ బంధువు సుబ్బరాయుడు కలిసి ఈ నెల 13వ తేదీన నిద్రపోతున్న నాగశేషును తలపై రోకలిబండతో మోది చంపేశారు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు అల్లుడు ఆటోలో తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలో నిమగ్నమైవున్నట్టు తెలుసుకుని ఆటోను అక్కడే వదిలివేసి పారిపోయినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో హత్య చేసిన భార్య, కుమార్తె, అల్లుడు, సుబ్బారాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు