తిరుపతి సమీపంలోని కాశిపెంట్ల గ్రామంలో ఎన్టిఆర్ ఉచిత ఆరోగ్య సేవా కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. ముఖ్యమంత్రి సొంత గ్రామం కావడంతో ఈ కేంద్రాన్ని ఎన్టిఆర్ ట్రస్టు కింద ఏర్పాటు చేశారు. నారావారిపల్లి, కాశిపెంట్లతో పాటు చుట్టుప్రక్కలలోని 15 గ్రామాల ప్రజలకు చికిత్సను ఈ ఎన్టిఆర్ సేవా కేంద్రంలో అందించనున్నారు. అలాగే సేవా కేంద్రం ఆవరణలో నారా భువనేశ్వరి చెట్లను కూడా నాటారు.