ఏపీ ప్రభుత్వ పెద్దలు కళ్లున్న కబోదిలు : నారా బ్రాహ్మణి

సోమవారం, 18 సెప్టెంబరు 2023 (12:39 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును మరోమారు ఆయన కోడలు, నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కళ్ళుండి కూడా నిజాలను చూడలేక పోతున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. కళ్లుండి కూడా ప్రభుత్వ పెద్దలు వాస్తవాలను చూడలేకపోతున్నారని విమర్శించారు. 
 
ప్రభుత్వం, సీఐడీ అధికారులు వ్యక్తం చేసిన, చేస్తున్న సందేహాలు, ఆరోపణలను సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ నివృత్తి చేసేలా ఆదివారం పూర్తి విచారణ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం కళ్లుండి కూడా చూడలేకపోతున్నారన్నారని, వైకాపా నేతలు అసమర్థులన్నారు. ఈ మేరకు ఆమె సోమవారం ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ సంస్థలతో పాటు మల్టినేషనల్ కంపనీలనూ వైకాపా అపహాస్యం చేస్తుందని ఆమె ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు