ఇది ఆత్మ‌హ‌త్య‌ల ప్ర‌దేశ్... ఫ్యాన్ కి ఉరేసుకుంటున్నారు: లోకేష్ ట్వీట్

సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:25 IST)
జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్ గా మారిపోయింది. ఫ్యాన్ కి ఓటేస్తే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువత ఇప్పుడు అదే ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నార‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
 
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన యువకుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన త‌న‌ను కలచివేసింద‌ని చెప్పారు. 
 
ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్నయువకుడు, జగన్ రెడ్డి మోసానికి బలైపోవడం బాధాకరం. వీరాంజనేయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇంకో యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తక్షణమే ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలి. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు పోరాడి  ఉద్యోగాలు సాధిద్దాం అంటూ నారా లోకేష్ త‌న ట్టిట్ట‌ర్లో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు