ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసు

శుక్రవారం, 22 డిశెంబరు 2023 (13:31 IST)
ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు జాతీయ ఎస్టీ ఎస్టీ కమిషన్ నోటీసు జారీచేసింది. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం గోవర్ధనపురం పంచాయతీ అర్లి గ్రామానికి చెందిన పాలకొండ నిర్మల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషన్‌ నోటీసు జారీచేసింది. 
 
జిల్లాలో ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌ (ఐఈఆర్పీ) ఒప్పంద పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని, తన పేరు ఓపెన్‌ కేటగిరీలో మొదటి స్థానంలో ఉన్నా ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారని జాతీయ ఎస్టీ కమిషన్‌ను నిర్మల ఆశ్రయించారు. 
 
దీనిపై స్పందించిన కమిషన్‌ గత నెల 17వ తేదీన ముఖ్య కార్యదర్శికి నోటీసు జారీచేసింది. ఏడు రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించగా నెల రోజులు గడిచినా పంపకపోవడంతో కమిషన్‌ తీవ్రంగా పరిగణించినట్లు నిర్మల తెలిపారు. 
 
వచ్చే నెల 2న నేరుగా ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్‌ ముందు పూర్తి వివరాలతో హాజరుకావాలని ఆయనకు మరో నోటీసు జారీచేశారని చెప్పారు. తనకు కూడా పూర్తి వివరాలతో హాజరు కావాలని నోటీసు జారీచేసినట్లు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు