ఆంధ్రజ్యోతిపై భగ్గుమన్న బాలయ్య ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకో తెలుసా?

శుక్రవారం, 22 డిశెంబరు 2023 (11:08 IST)
వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిపై నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. ఏకంగా పత్రిక పేపర్లను తగులబెట్టి తమ నిరసనను తెలిపారు. కావలిలో బాలకృష్ణ అభిమానులు ఇలా నిరసనకు దిగారు. తాజాగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం-నవశకం పేరుతో నారా లోకేష్ యువగళం పాదయాత్ర జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. అయితే ఆంధ్రజ్యోతిలో ఆయన పేరు గానీ, ఫొటో గానీ ప్రచురించలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ అభిమానులు కావలి ట్రంక్ రోడ్డులో ఆంధ్రజ్యోతి పేపర్‌ను తగులబెట్టారు.
 
కాగా, నందమూరి బాలకృష్ణపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం వివక్ష చూపుతోందని బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు కైవసం చేసుకున్నారు. 
 
కనీసం ఇప్పుడైనా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారా? అది అలా కాదు. దీనికి తోడు.. ఇప్పుడు ఎల్లో మీడియా కూడా నారా కుటుంబాన్ని మాత్రమే హైలెట్ చేయడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు