ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం వాయిదా

ఆదివారం, 25 ఆగస్టు 2019 (12:16 IST)
విశాఖ - విజయవాడ మధ్య డబుల్‌ డెక్కర్‌ ఏసీ రైలు ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మరణంతో దీన్ని వాయిదా వేశారు. వాస్తవానికి ఈ నెల 26వ తేదీన రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి ప్రారంభించాల్సి ఉంది. అయితే, అరుణ్ జైట్లీ మరణంతో దీన్ని వాయిదావేశారు. 
 
కాగా, ఈ రైలు ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరి, మధ్యాహ్నం 11.15 గంటలకు విజయవాడకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖకు చేరుతుంది. వారంలో 5 రోజులు (గురువారం, ఆదివారం మినహా) మాత్రమే నడిచే ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్ల మాత్రమే ఆగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు