భారీ వర్షానికి అండ‌ర్ బ్రిడ్జిలో నీరు... పెళ్లి కూతురు బలి

శనివారం, 23 అక్టోబరు 2021 (10:30 IST)
శుక్ర‌వారం అర్ధ‌రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ న‌వ వ‌ధువు బ‌లి అయిపోయింది. తిరుపతి బాలాజీ కాలనీ నుండి యం.ఆర్.పల్లి కి వెళ్లే దారిలో వెంగమాంబ కూడలి(వెస్ట్ చర్చ్) వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నీళ్లు 8 ఆడుగులకు పైగా నిలబడిపోయాయి. లోతు తెలియని సుమో పెళ్లి వాహనం దాటుకుని వెళ్లొచ్చు అనుకొన్న డ్రైవర్ నీళ్లలోకి వేగం వెళ్ల‌గా మ‌ధ్య‌లో సుమో ఆగిపోయింది. అప్పటికే సుమో మునిగిపోయేటంత లోతులోకి వెళ్లడంతో ఊపిరి ఆడక అందులోని పెళ్లి కూతురు అక్కడికక్కడే వాహనంలోనే  చనిపోయింది. మ‌రో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ సంఘటన రాత్రి సుమారు 1:30 పైన జరిగింది.. ఆ నీటిలో ఒక లారీ కూడా మునిగిపోయింది. వెస్ట్ చర్చి వద్ద  అండర్ బ్రిడ్జి లోకి భారీగా చేరుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. పెద్ద వ‌ర్షం కుర‌వ‌డంతో 8 అడుగులు లోతు నీరుంది. ఈ నీటికి ఊపిరి ఆడ‌క సుమోలో చిక్కుకున్న ఏడుగురు న‌ర‌క‌యాత‌న ప‌డ్డారు. నవ వధువు సంధ్య అక్క‌డిక‌క్క‌డే సీట్లో కూర్చుని అలాగే మృతి చెందింది. మరో చిన్నారికి అస్వస్థతగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ఎస్ వి యూనివర్సిటీ పోలీసులు వ‌చ్చి కాపాడారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు