ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జులరావుపేటకు చెందిన కొణతాల వెంకన్న అనే వ్యక్తి ట్రాలీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈయన తన సమీప బంధువు అప్పారావు కూతురు రేణుక(25)ను ప్రేమించి, పెళ్లి చేసుకొన్నాడు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత ఈనెల 11న శ్రీరాంనగర్లో ఇల్లు అద్దెకుతీసుకుని కాపురం పెట్టారు.
ఇంతలో వారిమధ్య ఏంజరిగిందో ఏమో తెలియదుకానీ భార్యను భర్త హత్య చేశాడు. శనివారం ఉదయం వెంకన్న ఇంటికి తాళం వేసి వెళుతుండటాన్ని ఇంటి యజమాని ప్రశ్నించాడు. అయితే, వెంకన్న సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. అయితే, రేణుక తల్లి పుష్పరాజ్యం శుక్రవారం సాయంత్రం నుంచే రేణుకకు ఫోన్ చేస్తూ వచ్చింది. కానీ రేణుక ఫోన్ లిప్టు చేయక పోవడంతో అనుమానం వచ్చింది.