మాది ఉమ్మడి కుటుంబం గొడవ... జాగ్రత్త కోసమే హెచ్ఆర్సీకి వెళ్లా... చక్రీ భార్య శ్రావణి

గురువారం, 18 డిశెంబరు 2014 (14:47 IST)
ఉమ్మడి కుటుంబంలో గొడవలనేవి సర్వసాధారణమనీ, తాను చక్రీ పరువు తీయాలనే ఆలోచనలేదని దివంగత సంగీత దర్శకుడు చక్రీ భార్య శ్రావణి తెలిపారు. అందరం కూర్చుని చర్చించుకుని సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటామని చెప్పారు. గురువారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.
 
ఆర్థికపరమైన అంశాలు ఏమీ లేవని తాను తనతల్లిదండ్రులనే కాదనుకుని చక్రీతో వచ్చి పెళ్ళి చేసుకున్నానని గుర్తు చేశారు. తనకు భవిష్యత్తులో ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశ్యంతోనే మానవహక్కుల కమిషన్ ను సంప్రదించానని అన్నారు. ఇంతకుమించి మరో ఉద్దేశ్యం లేదని తెలిపారు. 
 
చక్రీకి సంబంధించిన 11 రోజుల కార్యక్రమం అన్ని సవ్యంగా జరగాలనీ, ఆయన పరువు తీయాలనే ఉద్దేశ్యం తనకు ఎక్కడా, ఏ కోశానా లేదని చెప్పారు. అందరూ ఇందుకు సహకరించాలని ఉమ్మడి కుటుంబ వ్యవహారాల్లో ఇలాంటి గొడవలు సహజమనీ, అవి సమసిపోతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

వెబ్దునియా పై చదవండి