రైతుల కన్నీరు క్షేమదాయకం కాదు : పవన్ కళ్యాణ్

ఆదివారం, 22 జనవరి 2017 (11:11 IST)
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణనది లంక భూముల రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్‌కు క్షేమదాయకం కాదని జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉన్న మూలలంకలోని 207 ఎకరాల మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డ్‌గా మార్చడం ఎంతవరకు న్యాయమో ప్రజాప్రతినిధులు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి