అయితే ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు లేదు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయిస్తే, పింఛన్ అందకపోతుందా, అనుకున్న ఆమెకు ఊహించని విధంగా చెంపదెబ్బ తగిలింది.
వివరాల్లోకెళితే... పట్టణంలోని 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు లక్ష్మి, పింఛన్ ఇప్పించాలని తమ వార్డు కౌన్సిలర్గా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత నర్సింలును వేడుకుంది. ముసలమ్మకు సాయం చేయాల్సిన నర్సింలు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు.