రైలు ప్రమాదంలో గాయపడి యశోదా ఆసుపత్రితో చికిత్స పొందుతున్న చిన్నారులను సినీహీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం గాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా లాంటివి ప్రకటించి చేతులు దులుపుకోకుండా ఆ కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకోవాలన్నారు.