సన్యాసి అవుదామనుకుంటే.. పెళ్ళిళ్ళు జరిగిపోయాయ్.. కానీ ప్లాన్ చేసుకోలేదు: పవన్ కల్యాణ్

శనివారం, 12 నవంబరు 2016 (11:00 IST)
అనంత గుత్తిలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పెళ్లిళ్లపై పవన్ స్పందించారు. ఒక్కో దశలో సన్యాసంలో చేరిపోయి.. అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాలనే ఆలోచన మనసును గట్టిగా పట్టుకుని ఉండేదన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. ''పెళ్లి పెటాకులు లేకుండా ఏ హిమాలయాలకో వెళ్లి యోగిగా మారిపోదామనుకుంటే.. అది తప్ప అన్నీ జరిగిపోయాయి. చాలా పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. కాకపోతే ఇవన్నీ నేను ప్లాన్ చేయలేదు. అవంతట అవే జరిగిపోయాయి.. అంతే' అంటూ నవ్వుకున్నారు. 
 
ఇంకా ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ని ఓ విద్యార్థి ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటారా? అని అడుగగా.. ఒక్క గ్రామాన్ని కాదని.. మొత్తం అనంత‌పురాన్నే ద‌త్త‌త తీసుకుంటాన‌ని.. అంతటితో ఆగకుండా మొత్తం రాయ‌ల‌సీమను ద‌త్త‌త తీసుకుంటానని చెప్పారు. అమరావతి అభివృద్ధికి ఎంతో డ‌బ్బు ఖ‌ర్చుపెడుతూ.. అనంత‌పురాన్ని ప‌ట్టించుకోక‌పోతే ఊరుకోనని అన్నారు.
 
అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వహించిన విద్యార్థుల‌ ఇష్టాగోష్ఠిలో విద్యార్థులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మాధానాలు చెప్పారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన అధినేత‌ని ఓ విద్యార్థిని ‘అనంత‌పురం కోసం మీరు ఏం చేయ‌గ‌ల‌రు?’ అని ప్ర‌శ్నించింది. దీనికి పవన్ కల్యాణ్ స‌మాధానం చెబుతూ... త‌న‌కు పాదయాత్ర చేయాలని ఉందని తెలిపారు. పాదయాత్ర చేసే శక్తి తన‌కు ఉందని అన్నారు.

వెబ్దునియా పై చదవండి