ఇంద్రకీలాద్రిపై పవన్.. వారాహికి ప్రత్యేక పూజలు

బుధవారం, 25 జనవరి 2023 (11:00 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంద్రకీలాద్రిపై పూజలు చేశారు. కొండపైన దుర్గకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్న పవన్.. అనంతరం కొండ దిగువన ఘాట్ రోడ్డు టోల్ గేట్ వద్ద వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
 
జనసేనాని రాక దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.  పవన్ వెంట ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఉన్నారు. 
 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సుభిక్షంగా వుండాలని.. కొత్త నాయకులు రావాలని.. రాక్షస పాలనను తరిమికొట్టడమే వారాహి దేవి లక్ష్యమని.. అందుకే ఆమెకు పూజలు చేశానని పవన్ వ్యాఖ్యానించారు. 
 
అమ్మవారి ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రి వచ్చాం. కొండగట్టులో వారాహికి పూజలు చేశామని... ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు