జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

సెల్వి

సోమవారం, 16 సెప్టెంబరు 2024 (22:05 IST)
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్‌ను జనసేన పార్టీ తక్షణమే సస్పెండ్ చేసింది. జానీ మాస్టర్ జనసేన పార్టీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల 2024 సమయంలో పార్టీ ప్రచార కమిటీ వైస్-ఛైర్మెన్‌గా ఉన్నారు. గత రాత్రి, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో జానీపై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. 
 
21 ఏళ్ల బాధితురాలు కొరియోగ్రాఫర్‌గా కూడా ఉంది. జానీ కింద పని చేసేది. బాధితురాలు తన ఫిర్యాదులో జానీ తనను లైంగికంగా వేధించాడని, దాడి చేశాడని ఆరోపించింది. హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి నగరాల్లో ఔట్‌డోర్ షూటింగుల్లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. 
 
నార్సింగిలోని తన నివాసానికి వెళ్లి జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించేవాడని ఆమె పేర్కొంది. ఫిర్యాదు అందుకున్న రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును నరిసింగి పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. నార్సింగి పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద ఫిర్యాదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
ఉదయం నుంచి సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఈ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ జానీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ వార్త మీడియాలో వైరల్ కావడంతో వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుని ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 
 
గతంలో పలువురు వైసీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ జగన్ మోహన్ రెడ్డి వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వేగంగా వ్యవహరించడంపై సర్వత్రా కితాబిస్తూ చర్చ మొదలైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు