రైతులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడతకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు 20 విడతల్లో నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 21వ విడుత నిధులను విడుదల చేయడానికి సిద్ధమైంది.
అయితే ఈ రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో కూడా అతి త్వరలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడుత నిధులు విడుదల కానున్నాయి. అయితే ఈ నిధులు వీలయితే దీపావళి ముందుగానే లేకపోతే అక్టోబర్ చివరి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.