ప్రణయ్ పరువు హత్య.. ఉక్రెయిన్ నుంచి సోదరుడు.. వదినకు ఓదార్పు

ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (17:00 IST)
ప్రణయ్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడలో కులంలో తక్కువ వాడైనప్పటికీ తనకు వ్యతిరేకంగా కూతురిని పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో మామ కక్షకు బలైన ప్రణయ్‌ హత్యను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖండించారు. అమృత, ప్రణయ్ తల్లిదండ్రులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
 
మరోవైపు ప్రణయ్ భౌతికకాయానికి అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. అంత్యక్రియల్లో కుటుంబసభ్యులు, స్థానికులు, దళిత, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చేస్తున్న అజయ్ సోదరుడు మరణించిన విషయం తెలుసుకొన్న వెంటనే మిర్యాలగూడకు వచ్చాడు. ప్రణయ్ భౌతికకాయాన్ని చూడగానే కన్నీరుమున్నీరయ్యాడు. తల్లిదండ్రులను, వదినను ఓదార్చాడు.
 
కాగా స్కూల్ నుండే అమృతవర్షిణితో ప్రణయ్‌కు పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అమృత తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ప్రణయ్‌ను పెళ్లి చేసుకుంది. అయితే తన బిడ్డ కడుపుతో వున్నా.. పరువే ముఖ్యమని అమృత తండ్రి ప్రణయ్‌ని హత్య చేయించాడని ఆరోపణలున్నాయి. పోలీసులు మాత్రం ఇంకా నిందితులు తమ అదుపులో లేరని.. పరారీలో వున్న వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడిస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు