పుంగనూరు అల్లర్లు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదనీ...

మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (09:09 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటన సందర్బంగా చోటు చేసుకున్న అల్లర్ల కేసులో అనేక మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు. వీరిలో కొందరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరికొందరికి ఇంకా బెయిల్ రాలేదు. దీంతో తన కుమారుడికి బెయిల్ రాలేదన్న మనస్తాపంతో ఓ నిందితుడి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
ఈ ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలంలోని ఇరికిపెంటలో సోమవారం జరిగింది. గ్రామ సర్పంచి శ్రీనివాసులు నాయుడు అల్లర్ల కేసులో అరెస్టయి కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీకా ఉన్నారు. ఈ కేసులోని నిందితుల్లో 50 మందికి బెయిల్ వచ్చింది. కానీ, శ్రీనివాసులు నాయుడికి మాత్రం బెయిల్ రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికు గురైన అతని తల్లి రాజమ్మ తెలియని ద్రావకం ఏదో తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
దీన్ని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 వాహనంలో సదుం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు