యువతి ప్రేమించలేదని పక్కగదిలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారయత్నం..

మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (10:18 IST)
యువతి ప్రేమించలేదని ఓ యువకుడు ఓ యువతిని ఈడ్చుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి మనస్తాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... పీటీఎం మండలం బూర్లపల్లె పంచాయతీకి చెందిన ఓ విద్యార్థిని 9వ తరగతి చదువుతోంది. 
 
బాలికను హరీష్‌ అనే యువకుడు రెండునెలలుగా వెంటపడుతూ ప్రేమవేధింపులకు గురిచేస్తున్నాడు. పలుమార్లు తల్లిదండ్రులు యువకుడిని మందలించినా మార్పులేదు. బాలిక తమ మిద్దెపై దుస్తులు ఆరవేస్తుండగా, గమనించిన హరీష్‌ మిద్దెక్కి బాలికను పక్కగదిలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
అయితే, ఆ బాలిక కామాంధుడిని తప్పించుకునేందుకు బిగ్గరా అరిచింది. దీంతో హరీష్‌ మిద్దెదూకి అక్కడి పరారయ్యాడు. దీంతో మనస్థాపం చెందిన బాలిక అదేరోజు రాత్రి పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపున్నారు. 

వెబ్దునియా పై చదవండి