హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ తన భర్తతో పాటు యేడాది వయస్సుగల కుమారుడితో కలిసి పుట్టింటికి బయలుదేరింది. మార్గమధ్యంలో భర్తకు ఫోన్ రావడంతో ఆమెను బస్టాప్ వద్ద బస్సు ఎక్కించి వెళ్లిపోయాడు. పుట్టింటికెళ్లిన ఆమెకు రాత్రి 9 గంటల సమయంలో భర్త ఫోన్ చేసి త్వరగా ఇంటికి రావాలని చెప్పాడు. దీంతో భర్త దగ్గరకు వెళ్లటానికి ఆమె మేడ్చల్ చెక్పోస్టు వద్ద కుమారుడితో కలిసి నిలబడింది.
అక్కడ ఇద్దరూ కలిసి మందు తాగి ఆమె పర్సులో ఉన్న ఐదువేల రూపాయలు, సెల్ఫోన్ లాక్కున్నారు. నీ కుమారుడు కావాలంటే మా కోరిక తీర్చాలని బెదిరించారు. ఆమెపై అత్యాచారం చేసి వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న ఆమె భర్త సహకారంతో దుండిగల్ పోలీసులకు జరిగిన విషయంపై బుధవారం ఉదయం ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.