చంద్రబాబుకి అది వెన్నతో పెట్టిన విద్య... అచ్చెన్నాయుడికి కడుపు మంట.. రోజా

గురువారం, 13 జూన్ 2019 (16:31 IST)
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆయనకి ధన్యవాదాలు చెపుతూ ఎమ్మెల్యే రోజా గతంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తనపై ఏడాది పాటు బహిష్కరణ వేటు వేయడాన్ని గుర్తు చేశారు. సంప్రదాయాలు, విలువలు పాటించకుండా రాజకీయాలు చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆమె విమర్శించారు.
 
స్పీకర్ స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టేందుకు చంద్రబాబు నాయుడు రాకపోవడం అనేది మిమ్మల్ని అగౌరవపరిచినట్లేనని అభిప్రాయపడ్డారు. మిమ్మిల్ని చూస్తుంటే మీ జిల్లా నుంచి వచ్చిన అచ్చెన్నాయుడు కడుపు మంటగా వున్నట్లుగా వుంది. చెవిరెడ్డి గాపు బంట్రోతు అన్నందుకే అంతగా గుంజుకుంటున్నారు... తెదేపా నాయకులు చేసిన పనులకు ఎన్ని రోజులు గుంజీలు తీసి లెంపకాయలు వేసుకున్నా తప్పులేదు.
 
ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు శాసనసభ్యులు. వారి ఆశలను సాకారం చేసేందుకు మీ అనుభవంతో సభను హుందాగా నడిపించాలని కోరుకుంటున్నాను. దేశం అంతా ఇటువైపే చూస్తోంది. సభలో విలువలు గురించి తెదేపా మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. అని రోజా అన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు