కేసీఆర్‌కు కల్లు కాంపౌండ్ల మీద ఉన్న శ్రద్ధ?::సీతక్క

శుక్రవారం, 24 అక్టోబరు 2014 (15:37 IST)
తెలంగాణలో కరెంట్ లేకపోయినా మందుబాబులు పండగ చేసుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తిన సీతక్క.. తెలంగాణలో కల్లు కాంపౌండ్లు వెల్లి విరిసేలా కేసీఆర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కేసీఆర్‌కు కల్లు కాంపౌండ్ల మీద ఉన్న శ్రద్ధ... రైతులకు విద్యుత్ అందించాలనే దానిపై లేదన్నారు. తెలంగాణ ప్రజలకు విద్యుత్ లేకున్నా.. మద్యం మాత్రం ఫుల్‌గా దొరుకుతోందని సీతక్క ఎద్దేవా చేశారు.

వెబ్దునియా పై చదవండి