తెలుగు రాష్ట్రాలకు షాక్... 50 ఇంజినీరింగ్ కాలేజీలు క్లోజ్...

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (21:07 IST)
ఇంజినీరింగ్ కోర్సులపై మోజు తగ్గిపోయినట్లు అర్థమవుతుందనేందుకు ఇదే నిదర్శనం. దేశ వ్యాప్తంగా 800 ఇంజినీరింగ్ కాలేజీలు మూతపెట్టాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్ణయానికి వచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవి 50 కళాశాలలు వున్నాయి. 
 
వచ్చే విద్యా సంవత్సరానికి దీన్ని అమలు చేయనున్నారు. దీనికి కారణం... గత ఐదేళ్లుగా ఆయా కళాశాలలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, తక్కువగా సీట్లు భర్తీ కావడమే. ప్రస్తుతం చదువుతున్న వారు కొనసాగించవచ్చు కానీ కొత్తగా ఇక  అడ్మిషన్లు వుండబోవని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి