నీతూకు ఎర్రచందనం అక్రమ రవాణాతో ఎలాంటి సంబంధాలు లేవని వలీ వివరించాడు. గతంలో కమీషన్ల కోసం ఎర్రచందనం అక్రమంగా రవాణా చేసిన మాట నిజమేనని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాటన్నింటికి దూరంగా ఉంటున్నానని మస్తాన్ తెలిపాడు.
ఓ కేసు విచారణలో భాగంగా పోలీసులు మస్తాన్ను అనంతపురం జిల్లాకు తీసుకురాగా, ఆయన మీడియాకు ఈ విషయాలు వివరించాడు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే కొందరు ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు. కాగా, ఈ కేసులో నీతూను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.