రోడ్డుపై పాము.. తప్పించాలనుకుని సడన్ బ్రేక్... ఏం జరిగింది?

సోమవారం, 25 ఏప్రియల్ 2022 (16:02 IST)
రోడ్డుపై పామును చూసిన వాహనదారులు దానిని తప్పించాలనుకున్నారు. కానీ పామును తప్పించబోయి నాలుగు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంకా గంగవరం మండలంలోని జాతీయ రహదారిపై కీలపట్ల క్రాస్‌వద్ద ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే... తిరుపతి నుండి బెంగళూరుకు వెళుతున్న కారు డ్రైవర్ రోడ్డు మధ్యలో పాము రావడంతో సడన్ బ్రేక్‌ వేశారు. వెనకే వస్తున్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో అందులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు