భార్యపై అలిగిన.. శ్రీకాళహస్తి పుష్కరిణిలో దూకి భర్త ఆత్మహత్య

శనివారం, 30 ఏప్రియల్ 2016 (12:23 IST)
కుటుంబ కలహాల కారణంగా భర్తపై అలిగిన ఓ భర్త శ్రీకాళహస్తి ఆలయం పుష్కరిణిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాళహస్తి పట్టణంలోని దర్గామిట్టలో నివాసముంటున్న మస్తాన్‌ మద్యానికి బానిసయ్యాడు. ఇదే విషయంపై భార్య షకీరాకు మస్తాన్‌కు గత కొన్నిరోజులుగా గొడవ జరుగుతూ ఉండేది. 
 
శనివారం తెల్లవారుజామున కూడా పూటుగా మద్యం సేవించిన మస్తాన్‌ భార్యపై గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర మనస్థాపానికి గురైన మస్తాన్‌ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలోని వైష్ణవ పుష్కరిణిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుప్రతికి పంపించారు. 

వెబ్దునియా పై చదవండి