ప్రత్యేక హోదా కోసం కర్నూలులో మరో బలిదానం.. నిన్న ధర్నా... నేడు మృతి

శుక్రవారం, 28 ఆగస్టు 2015 (12:06 IST)
ప్రత్యేక హోదా కోసం మరొకరు బలిదానం చేశారు. కర్నూలుకు చెందిన లోకేష్ అనే వ్యక్తి గురువారం జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఆ తర్వాత స్థానిక బీజేపీ నేతలతో మాట్లాడారు. వారి మాటల్లో ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని తేలడంతో లోకేష్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం ఉదయం లోకేష్‌కు గుండెపోటు వచ్చి కన్నుమూశాడు. 
 
లోకేష్ మృతితోనైనా రాజకీయ పక్షాలు కన్ను తెరచి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని ప్రత్యక హోదా సాధన సమాఖ్య విజ్ఞప్తి చేసింది. లోకేష్ మృతికి పలువురు సంతాపం తెలిపారు. మరోవైపు కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ మహిళా నేత కుమారుడు ఉదయభాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ సూసైడ్ నోట్ రాసి పెట్టి ఉరివేసుకున్నాడు. 

వెబ్దునియా పై చదవండి