ఓ ముస్లింను, ఓ ఫకీరును పూజించే దుస్థితికి ఎందుకు : గోవిందానంద సరస్వతి

శనివారం, 29 అక్టోబరు 2016 (12:25 IST)
పవిత్రమైన, ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన హిందూ ధర్మాన్ని వదులుకుని ఓ ముస్లింను, ఓ ఫకీరును పూజించే దుస్థితికి ఎందుకు దిగజారుతున్నారు? అంటూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోవిందానంద సరస్వతి ప్రశ్నించారు. 
 
హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఇష్టం వచ్చిన పూజలు, పునస్కారాలు నిర్వహిస్తూ, దానికి దైవత్వం ఆపాదిస్తున్నారని విమర్శించారు. ఏ ఆధారాలతో సాయిబాబాకు దైవత్వం ఆపాదిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
 
ధర్మానికి అపచారం జరిగితే తాము ఖచ్చితంగా రంగ ప్రవేశం చేస్తామన్నారు. ధర్మాన్ని ఆచరించమని తాము చెబుతున్నామని, వేదాన్ని భ్రష్టుపట్టిస్తామని అంటే తాము ఊరుకోమన్నారు. గాయత్రీ మంత్రాన్ని సాయి భక్తులు కలుషితం చేస్తున్నారని గోవిందానంద సరస్వతి మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి