పరిపాలనా సౌలభ్యానికే కొత్త జిల్లాల ఏర్పాటు : మంత్రి తలసాని

బుధవారం, 11 మే 2016 (16:39 IST)
పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకుంటుంటే, ఇక్కడి విపక్ష పార్టీలు కుటిల రాజకీయాలు చేస్తూ ఆరోపణలు చేయటం తగదన్నారు. అవినీతిపరులైన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తెరాస నాయకులను విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. 
 
పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో 24 జిల్లాల ఏర్పాటును జూన్‌ 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాస్త్రీయ కోణంలో జిల్లాలను పునర్విభజన చేసినట్లు వివరించారు. పాలేరు ఉప ఎన్నికలో ఓడిపోతే రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్‌ విసిరిన సవాలుకు కాంగ్రెస్‌ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

వెబ్దునియా పై చదవండి