తగువులు పెట్టందే తాగిన ఓడ్కా మత్తు దిగదేమో..: వర్మకు దివ్వవాణి కౌంటర్

గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:07 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు సినీ నటి, టీడీపీ మహిళా నేత దివ్యవాణి గట్టి కౌంటర్ ఇచ్చారు. తగువులు పెట్టందే తాగిన ఓడ్కా మత్తు దిగదేమో అంటూ విమర్శించారు. పైగా, వర్మను పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్లుంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
 
తెలుగుదేశం పార్టీ పగ్గాలను హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పజెప్పాలంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనిపై దివ్యవాణి ఘాటుగా స్పందించారు. 
 
'నారా లోకేష్ సత్తా ఏంటో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డ్స్ వచ్చాయో చూస్తే తెలుస్తుంది. నీలా, నీవు వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డిలాగ 420 పనులేవీ చేయెట్లా. నీకు పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్లుంది. జూనియర్ ఎన్టీఆర్‌గారు ఎప్పుడో చెప్పారు. 
 
టీడీపీ కోసం నేను ఎప్పుడైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను అని. నీ నారదుడి సలహా ఆయనకు అక్కర్లా ఎప్పుడేమి చేయాలో ఎన్టీఆర్‌గారికి తెలుసు. నారదుడిలాగ ఎప్పుడూ ఎవరికో ఒకరికి తగువులు పెట్టంది నీకు తాగిన ఓడ్కా మత్తు దిగదేమో. ఇలాగే తాగి వాగితే మా టీడీపీ సైనికులు నీకు ఏదో రోజు దేహశుద్ధి చేయక తప్పదు. తస్మాత్ జాగ్రత్త' అంటూ దివ్యవాణి ఆర్జీవీపై చెలరేగిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు