అసెంబ్లీ సమావేశాల్లో హత్యారాజకీయాలపై శాసనసభలో చర్చకు తెచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ లోపలా బయటా తెంపు లేకుండా జగన్పై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నాయకులు జగన్ వైఖరిపై తూర్పారబడుతున్నారు.
టిడిపి సభ్యులకు స్పీకర్ కోడెల సర్దిచెప్పేందుకు యత్నించినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. భాన్ కిరణ్, కృష్ణ తెలుసా అని తాను జగన్ను అడిగానని, అలా అడిగితే తమను బఫూన్లంటూ వ్యాఖ్యానిస్తారా అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
టిడిపి సభ్యుల ఆందోళనకు ప్రతిగా వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులు నినాదాలు చేశారు. జగన్ క్షమాపణ చెప్తే సభకు గౌరవమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ముఖ్యమంత్రులు, స్పీకర్లూ గతంలో క్షమాపణలు చెప్పిన ఘటనలు ఉన్నాయని, జగన్ క్షమాపణ చెప్పడానికి సంశయించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.