శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. అత్యంత కీలకమైన ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య రగడకు దారి తీస్తోన్న శ్రీశైలం విద్యుత్ ఉత్పాదన విషయం వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక సమావేశం జరపనున్నారు. జిల్లాల వారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యి జిల్లాల సమస్యలను అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం. కాగా నవంబరు అయిదో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ముఖ్యమైనవిగా తెలుస్తోంది.