మరోవైపు ఏపీకి మూడు మెగా ఐటీ హబ్లు ఏర్పాటు కానున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో దాదాపు రెండువేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ మెగా ఐటీ హబ్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇందులో రూ.500 కోట్లు ఈ-సేవలు అందించేందుకు వీలుగా పదివేల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వెయ్యి కోట్ల రూపాయల్లో రెండువందల కోట్లు కేంద్రం నుండి వచ్చే అవకాశముంది.