తెలంగాణ ప్రభుత్వం పదిమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు కూడా ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా జిడి ప్రియదర్శన్ను నియమించారు. ప్రస్తుతం అక్కడ కలెక్టర్గా ఉన్న గిరిజాశంకర్ను బదిలీ చేసినప్పటికీ ఆయనకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సబ్ కలెక్టర్గా పని చేస్తున్న అమరపాలి కటాను అక్కడి నుంచి బదిలీ చేసి మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్గా నియమించింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తున్న జె నివాస్కు ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్గా పూర్తి బాధ్యతలు అప్పగించింది.