ఇదే అంశంపై ఏపీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య A1 ద్రోహి అని ధ్వజమెత్తారు. వెంకయ్యనాయుడు నిజాయితీ ఆంధ్రా ప్రజలకు బాగా తెలుసన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడం తప్పని కాంగ్రెస్ ఒప్పుకుందని... వర్సిటీల్లో ప్రస్తుత పరిస్థితులకు బీజేపీనే కారణమని ఒప్పుకునే ధైర్యం వెంకయ్యకు ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వారు మండిపడ్డారు.