హుదూద్ తుఫాను కారణంగా సర్వం కోల్పోయిన విశాఖ వాసులకు త్వరితగతిన సహాయక చర్యలు అందించే క్రమంలో చంద్రబాబు రేయింబవళ్లు పనిచేసిన వైనం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆకట్టుకుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. చంద్రబాబు నిజమైన ప్రజా సేవకుడని ప్రధాని మోడీ కీర్తించారని వెంకయ్య తెలిపారు.
విశాఖ వాసులు, హుదూద్ తుఫానుకు ఎదురొడ్డి నిలిచిన వైనం అమోఘమని చెప్పారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుల కృషి ఫలితంగా విశాఖకు పూర్వ వైభవం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.