ఈ తనిఖీల సందర్భంగా అమర్కాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అనుమతి లేని కంపెనీలకు చెందిన 23రకాల నూనె డబ్బాలు, నూనె ప్యాకెట్లు, నూనె కల్తీ జరుగుతున్నట్లు వచ్చిన అనుమానంతో రూ.8లక్షల విలువ చేసే నూనెను సీజ్ చేశామని తెలిపారు.
అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వచేసియున్న రూ.1.80 లక్షల విలువ చేసే 91 క్వింటాళ్ల గోధుమ పిండి, రూ. 20 వేల విలువ చేసే సోంపు ప్యాకెట్లు, రూ. 30వేల ధర విలువ చేసే సబ్బులతో పాటు పెద్ద ఎత్తున సర్ఫ్ను సీజ్ చేసినట్లు విజిలెన్స్ డీఎస్పీ అమర్కాంత్రెడ్డి పేర్కొన్నారు.